ప్రజలకు మరింత చేరువైన ప్రజా ప్రభుత్వం

సీఎం రేవంత్

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంతో ప్రజా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మార్చి 16 నుంచి జూన్ 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా 99 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలపై సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలు జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు చేపట్టిన కార్యక్రమాలు, వాటి ఫలితాలపై అధికారులు నివేదికలు సమర్పించారు. సమీక్ష సందర్భంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో చురుగ్గా పనిచేసిన శాఖలను ముఖ్యమంత్రి అభినందించారు. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రధాన కార్యదర్శుల నుంచి జిల్లా కలెక్టర్ల వరకు ప్రతి నెలా క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి ఉండగా, ఆ ఆదేశాలను అమలు చేయని అధికారుల వివరాలు అందించాలని సీఎస్ రామకృష్ణారావును ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని అధికారులపై క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ కోరాలని సూచించారు. ప్రచారంపై దృష్టి ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో చేపట్టిన కార్యక్రమాలను కొన్ని శాఖలు ప్రజల్లోకి ఆశించిన స్థాయిలో తీసుకెళ్లలేకపోయాయని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పనులు, ఫలితాలను మీడియా, డిజిటల్ మీడియా ద్వారా ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ బాధ్యతను ఆయా శాఖల ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. గ్రామ సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సమస్యలను నమోదు చేసి పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. గత మూడు నెలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, సృష్టించిన ఆస్తుల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని సూచించారు. పంచాయతీ భవనాలు, సోలార్ ప్లాంట్లు రాష్ట్రంలో ఇప్పటికీ గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాల జాబితాను సిద్ధం చేసి, కొత్త భవనాల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించారు. అన్ని పాఠశాల భవనాలపై సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విద్య, వైద్య శాఖల్లో అన్ని స్థాయిల్లో ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరు విధానాన్ని అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. పాఠశాలల నుంచి కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ఉస్మానియా, గాంధీ వంటి ప్రధాన ఆసుపత్రుల వరకు ఉద్యోగులందరికీ ఇదే విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాల వారీగా ప్రత్యేక సమీక్షలు రాష్ట్రస్థాయి సమీక్ష తరహాలోనే ప్రతి జిల్లాలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికపై ప్రత్యేక సమీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి, జిల్లా కలెక్టర్‌తో కలిసి 99 రోజుల కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించాలని సూచించారు. అనంతరం జిల్లాల వారీగా ప్రగతి నివేదికలు విడుదల చేయాలని చెప్పారు. డ్యాష్‌బోర్డులో లబ్ధిదారుల వివరాలు నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను సేకరించి డ్యాష్‌బోర్డులో అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. సీఎం హామీలపై నివేదిక కోరిన రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాల పర్యటనలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కూడా సీఎం ఆరా తీశారు. నియోజకవర్గాల వారీగా హామీల అమలు పురోగతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రణాళిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేమ్ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
165 వీక్షణలు

ట్యాగ్‌లు

#telangana #cm #revanth #reddy #prajapalana

సంబంధిత వార్తలు

రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి

సీఎం రేవంత్

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రుణమాఫీపై కాంగ్రెస్‌దే వైఫల్యం -

మాజీ మంత్రి పువ్వాడ ధ్వజం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

పరిరక్షణ నిల్వ’గా కొండకర్ల ఆవ..

చిత్తడి నేలల పరిరక్షణపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విద్యార్థుల విజయం మార్పుకు సంకేతం

మాజీ మంత్రి పువ్వాడ

రచయిత Venkat Kommineni ·