ఓట్ల తొలగింపునకు కేంద్రం కుట్ర: మంత్రి పొంగులేటి

కాంగ్రెస్ బలంగా ఉన్న చోట 30-35 శాతం ఓట్లను ‘ఫేక్’ పేరిట తొలగించే యత్నం

ఖమ్మం,(ఏదులాపురం): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో 30 నుంచి 35 శాతం ఓట్లను ‘ఫేక్‌ ఓట్లు’గా చిత్రీకరించి జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు. పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్‌ఏ) అవగాహన శిక్షణ శిబిరం శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట క్రాస్ రోడ్డులో గల పీవీఆర్ గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ఓటరు వయస్సు, పేర్లలో స్వల్ప పొరపాట్లను సాకుగా చూపి ఓట్లను తొలగించే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే బీహార్‌, పశ్చిమ బెంగాల్‌లలో ఇటువంటి విధానాన్ని అమలు చేశారని, అదే తరహా ప్రయత్నాలు తెలంగాణలోనూ జరుగుతున్నాయని ఆరోపించారు. ‘ఎస్‌ఐఆర్‌’పై విమర్శలు ‘ఎస్‌ఐఆర్‌’ ఒక పెద్ద భూతంలాంటిదని, ఇది దొంగదారి చర్య అని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటును కాపాడుకోవాలని సూచించారు. రాజ్యసభ ఎన్నికల ప్రస్తావన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను ప్రస్తావించిన మంత్రి, కావలసిన దానికంటే ఎక్కువ ఓట్లు ఉన్నప్పటికీ ఒత్తిడితో నామినేషన్‌ను తిరస్కరించారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు దక్కాల్సిన ఒక రాజ్యసభ స్థానాన్ని దూరం చేశారని విమర్శించారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ వంటి సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని మంత్రి ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ప్రజాప్రతినిధులను భయపెడుతున్నారని అన్నారు. ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే ఓటు మ్యాపింగ్ ప్రక్రియలో కాంగ్రెస్ శ్రేణులు చురుకుగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. ఉద్యోగాలు, విద్య కారణంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు గ్రామాలకు వచ్చి తమ పేర్లు జాబితాలో కొనసాగుతున్నాయో లేదో పరిశీలించుకోవాలని కోరారు. దొంగ ఓట్లు అవసరం లేదని, ఉన్న ప్రతి ఓటును కాంక్రీట్ గోడలా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, పీసీసీ ప్రతినిధి సుధాకర్, ఏదులాపురం మున్సిపల్ చైర్మన్‌, వైస్ చైర్మన్‌, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, 291 బూత్‌ల బీఎల్‌ఏలు పాల్గొన్నారు.
154 వీక్షణలు

ట్యాగ్‌లు

#khammam #ministerponguleti #sir #ndavsindia

సంబంధిత వార్తలు

రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌

షెడ్యూల్‌ విడుదల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి

పవన్‌కళ్యాణ్ నామకరణం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లతో మంత్రి తుమ్మల సమీక్ష

బకాయిల చెల్లింపుపై స్పష్టత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తాం

ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి

సీఎం రేవంత్

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రుణమాఫీపై కాంగ్రెస్‌దే వైఫల్యం -

మాజీ మంత్రి పువ్వాడ ధ్వజం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

పరిరక్షణ నిల్వ’గా కొండకర్ల ఆవ..

చిత్తడి నేలల పరిరక్షణపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

విద్యార్థుల విజయం మార్పుకు సంకేతం

మాజీ మంత్రి పువ్వాడ

రచయిత Venkat Kommineni ·